దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచమంతా చాటి చెప్పిన బాహుబలి సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ తీవర నిరాశకు గురయ్యారు. ఈవెంట్ ఎక్కడెక్కడో అనుకుని ఫైనల్ గా హైదరాబాద్ రామోజి ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. 


భద్రతా విషయంపై కేవలం 10 గంటల దాకే ఈ ఫంక్షన్ కు పర్మిషన్ ఉందట. అసలైతే సాయంత్రం ఆరున్నరకు స్టార్ట్ అవ్వాల్సిన ఈ వేడుక దాదాపు గంట పాటు లేట్ అయ్యింది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూ గురించి ప్రత్యేకమైన ఏవిలతో సినిమాకు వారు చేసిన డెడికేషన్ గురించి చెప్పారు.


ఇక ఈవెంట్ ఏదైనా ఫ్యాన్స్ ఎదురుచూసేది తమ అభిమాన హీరో మాట్లాడే ఆ చివరి మాటల కోసమే. సమయం మించిపోవడం వల్ల రాజమౌళి కూడా చాలా తక్కువ సేపే మాట్లాడాడు. సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం అందరికి పేరు పేరుగా విష్ చేసిన జక్కన్న చివరకు ప్రభాస్ కు మైక్ ఇచ్చాడు. అప్పటికే సమయం మించిపోతుండటంతో కేవలం ప్రభాస్ ఒక నిమిషం కూడా సరిగా మాట్లాడకుండా అయ్యింది.


బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడకు వచ్చిన వారంతా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్సే. మరి అలాంటిది ప్రభాస్ అంత తక్కువ టైం మాట్లాడటం ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా చేసింది. హాయ్ దార్లింగ్స్ అంటూ మైకందుకున్న ప్రభాస్ రెండు డైలాగులు చెప్పి ఆపేశాడు. మరి సినిమా మెయిన్ హీరో అయిన ప్రభాస్ మరో రెండు నిమిషాలు మాట్లాడితే బాగుండేది అనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: