‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు రాజమౌళి తన కొడుకు కార్తికేయ పై చేసిన ఆసక్తికర కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి. తన కొడుకు డైరెక్టర్ గా కన్నా నిర్మాతగా బాగా రాణిస్తాడు అని అంటూ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి తనకే లెక్కలు చెపుతూ తన మైండ్ ను తరుచూ కార్తికేయ బ్లాంక్ చేస్తూ ఉంటాడు అంటూ ఏకంగా తన కొడుకు పై సెటైర్లు వేశాడు రాజమౌళి.

ఇదే సందర్భంలో ‘బాహుబలి 2’ ట్రైలర్ గురించి మాట్లాడుతూ ఆ ట్రైలర్ రెడీ చేసే సమయానికి తాను ‘బాహుబలి 2’ షూటింగ్ పనులలో చాల బిజీగా ఉన్న సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తన కొడుకు కార్తికేయతో తాను ఇప్పుడు ట్రైలర్ కట్ చేసే మూడ్ లో లేనని ఏదోఒకటి చేయమని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు రాజమౌళి.

అయితే ‘బాహుబలి 2’ ట్రైలర్ కు సంబంధించి తన కొడుకు కార్తికేయ ఈమూవీ ట్రైలర్ కోసం ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం చేసే ప్రభాస్ డైలాగ్ తో ‘బాహుబలి 2’ ట్రైలర్ ను కార్తికేయ మొదలు పెట్టడంతో తనకే గుండె దడదడలాడింది అని అంటూ కామెంట్ చేసాడు రాజమౌళి. 

అంతేకాదు ఈ ‘బాహుబలి 2’ సెకండ్ యునిట్ నుఎక్కువగా డైరెక్ట్ చేసింది కార్తికేయ అని అంటూ అతడికి దర్శకుడుగా ఎదగాలని కోరిక ఉన్నా తనకు మాత్రం తన కొడుకుని ఒక భారీ సినిమాల నిర్మాతగా చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేసాడు.  ‘బాహుబలి 2’ ట్రైలర్ కు సంబంధించి 25 వర్షన్లు కట్ చేశాక మాత్రమే ఒక ఫైనల్ ట్రైలర్ వర్షన్ కార్తికేయ తయారుచేసాడు అంటూ ఈమూవీ కోసం కార్తికేయ పడిన కష్టాలను వివరిస్తున్నప్పుడు రాజమౌళి గొంతు ఉద్వేగభరితంగా మారింది.

అయితే ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి ఏమి బాగుండటం లేదు అని ఎందరో భారీ నిర్మాతలు చెపుతూ ఉంటే రాజమౌళి ఆ విషయాలను పట్టించుకోకుండా తన కొడుకుని భారీ నిర్మాతగా చూడాలి అని ఆశ పడటం ఊహించని ట్విస్ట్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: