టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత మూడు సంవత్సరాలుగా ఓ హీరో, నిర్మాతల మధ్య గొడవ తీవ్రస్థాయిలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ సైలెంట్ గా ఉన్నప్పటికీ...ప్రత్యేక ఇంటర్వ్యూల్లో ఎవరికివారు కామెంట్ చేసుకోవటం హాట్ టాక్స్ కి దారితీసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...తాజాగా టాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్లగణేష్‌ పై యంగ్ హీరో సచిన్ విరుచుకుపడ్డాడు.

తాజాగా మీడియాతో మాట్లాడిన సచిన్... బండ్లగణేష్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా తీవ్రస్థాయిలో విరుచుపడటంతో వీరిద్దరి మధ్య ఉన్న గొడవ పెద్దది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక గణేష్‌ పై హీరో అన్న మాటలు చూస్తే...బండ్ల గణేష్ పెద్ద ఇడియట్ అని చెప్పుకొచ్చారు. అలాగే బండ్లగణేష్‌ పై 14 చెక్ బౌన్స్ కేసులున్నాయని చెప్పుకొచ్చారు.

ఇవన్నీ లీగల్ కేసులేనని చెప్పటం మరింత విశేషం. ఇక గొప్పలు చెప్పుకునే బండ్లగణేష్‌ ఎప్పుడో జైలుకి వెళ్ళాలని తెలియజేశారు. అంతే కాకుండా బండ్లగణేష్‌ తండ్రి తన వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకోవడంతో అతన్ని జైలుకు పంపకుండా వదిలానని తెలిపారు. బండ్లగణేష్‌ పై సచిన్ జోషి ఈ విధమైన కామెంట్స్ చేయటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్స్ అయ్యాయి.

సెలెంట్ గా ఉన్న వీరి గొడవ మళ్ళీ రచ్ఛ రచ్ఛగా మారిందని అంటున్నారు. ఇక ‘నీ జతగా నేనుండాలి’ చిత్రం కోసం చేతులు కలిపిన ఈ ఇద్దరూ ఆ సినిమా విడుదలై పరాజయం కావడంతో ఇద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీలు గొడవలు పెరుగుతూ వచ్చాయి. బండ్ల సినిమా కోసం తన వద్దే డబ్బు తీసుకుని తనను మోసం చేసాడని సచిన్ ఆరోపించగా, ఆ డబ్బు తనదేనని...సచిన్ తో సినిమా తీయడం వలన చాలా నష్టపోయానని బండ్ల గణేష్‌ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: