మెగా ఫ్యామిలీలో హీరోల సంఖ్య ఎక్కువవడం వల్ల కాస్త స్టార్ ఇమేజ్ రాగానే వేరు కుంపటి పెట్టేసుకుంటున్నారు. మెగాస్టార్ తర్వాత ఇప్పటికే దాదాపు అంత ఇమేజ్ సాధించిన పవర్ స్టార్ ను చూస్తూనే ఉన్నాం. ఇక మరో పక్క మెగా సపోర్ట్ తో వచ్చిన అల్లు హీరో అల్లు అర్జున్ అలియాస్ బన్ని కూడా వరుస విజయాలతో ఓ రేంజ్ ఫాంలో ఉన్నాడు.


ఇమేజ్ చట్రంలో ఇరుకున్న వీరు ఒకరి గురిచి ఒకరు మాట్లాడటం కష్టమైన వేళ తెలిసో తెలియకో పవన్ గురించి 'చెప్పను బ్రదర్' అని పవన్ ఫ్యాన్స్ కు దూరమయ్యాడు అల్లు అర్జున్. ఇక ఆ విషయంలో జరుగుతున్న రగడ తెలిసిందే. సోషల్ మీడియా సాక్షిగా ఇద్దరి హీరోల అభిమానులు చాలా హడావిడి చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర మెగా ఫ్యాన్స్ అంతా కేక్ కట్ చేశారు.


ఈ ప్రోగ్రాంకు అల్లు అరవింద్ తో పాటు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ అటెండ్ అయ్యారు. అల్లు అర్జున్ తరపున అరవింద్ రాగా పవన్ ఫ్యాన్ గా తేజ్ వచ్చాడు. సో ఈ లెక్కన పవన్ బన్ని ఫ్యాన్స్ మధ్య గొడవలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారన్నమాట. ఇక కాటమరాయుడు గురించి బన్ని ట్వీట్ చేయడం కూడా ఈ గొడవకు తెర లేపినట్టే అంటున్నారు.  


ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ అంతా కలిసి ఉంటేనే మంచిది. ఎవరికి వారు ఇలా విడిపోయి గొడవలు పడితే తమ హీరోలకు అంత మంచిది కాదు. ఈ విషయం కాస్త గమనించి మెగా ఫ్యాన్స్ అంతా కలిసికట్టుగా ఉంటే బెటర్ అని అంటున్నారు సిని విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: