మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన ముగ్గురు మేనమామలతో ఒకే విధమైన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ మెగా కుటుంబ రాజకీయాలతో తనకు ఎటువంటి సంబంధంలేదు అన్న సంకేతాలు ఇస్తూ మెగా అభిమానులందరి మన్ననలను పొందడానికి చాలా వ్యూహాత్మకంగా   ప్రవర్తిస్తున్నాడు. దీనికితోడు సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ తీయబోతున్న ఒక మూవీలో కూడ హీరోగా నటిస్తున్నాడు అని వార్తలు రావడం బట్టి ఈ యంగ్ హీరో ఎంత తెలివిగా అడుగులు వేస్తున్నాడో అర్ధం అవుతుంది. 

నిన్న మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తేజ్ చరణ్ తరఫున కేక్ కట్ చేసి మెగా అభిమానులకు జోష్ ను కలిగించాడు. ఒక ప్రక్కన చరణ్ ఫారిన్ డెస్టినేషన్లో తన పుట్టినరోజు జరుపుకుంటుంటే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టులో తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. 

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ అలాగే యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.  ఒక ప్రక్కన అల్లుఅరవింద్ కు మెగా కుటుంబానికి మధ్య దూరం పెరుగుతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అరవింద్ ఇలా వ్యూహాత్మకంగా ఇలా సాయి ధరమ్ తేజ్ ను ఉపయోగించుకుని చరణ్ పుట్టినరోజును సెలిబ్రెట్ చేయడం మెగా అభిమానులను బాగా ఆకర్షించింది. 

మెగా హీరోల్లోనే సాయిధరమ్ ఒక కొత్తరకం ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.  దీనికితోడు అటు అరవింద్ ఇటు తేజ్ ఇలా ఇద్దరూ కలసి చరణ్ కోసం కేక్ కట్ చేశారంటే అసలు పవన్ ఫ్యాన్స్ అండ్ బన్నీ ఫ్యాన్స్ మధ్యన పెద్దగా మ్యాటర్ చెడిందేమీ లేదని  ప్రచారం చేయడానికి అరవింద్ ఇలా వ్యూహాత్మకంగా తేజ్ ను ప్రయోగించాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా అరవింద్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడ రామ్ చరణ్ పుట్టినరోజును బాగా వ్యూహాత్మకంగానే ఉపయోగించుకున్నారనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: