తెలుగు ఇండస్ట్రీలో ‘ఝుమ్మందినాధం’ చిత్రంతో హాట్ హాట్ గా దర్శనమిచ్చిన తాప్సీ తర్వాత వచ్చిన సినిమాల్లో పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది. ఒకదశలో సైడ్ హీరోయిన్ గా కూడా వచ్చిన తాప్సీ ఆ మద్య గోపీ చంద్ తో తీసిన ‘సాహసం’ మంచి పేరు తెచ్చింది. గత సంవత్సరం లారెస్స్ సరసన వచ్చిన కాంచన 2 తెలుగులో గంగ చిత్రం మంచి విజయం సాధించింది. అయినా కూడా తాప్సికి మాత్రం పెద్ద చాన్సులు ఏమీ రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీపై ద్రుష్టి పెట్టింది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను చదువుకుంటూనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టానని,అయినా క్యాట్ ఎగ్జామ్ లో 88శాతం మార్కులు సాధించానని,ఆ సమయంలో పాకెట్ మనీ కోసం సరదాగా సినిమాలో ఆఫర్ వస్తే నటించానని చెప్పింది.అయితే తాను నటించిని మొదటి మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావటంతో తనకు ఐరన్ లెగ్ అనే ముద్రపడిందని ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను ఐరన్ లెగ్ అనడం వల్లే తనకు సినిమాలో ఆఫర్లు రావటం లేదని ఆరోపించింది. సినిమాలు ఆడకపోతే తప్పునాది ఎలా అవుతుందో ఐరన్ లెగ్ అనేవాళ్లు స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది.
ఐరన్ లెగ్ పదం ఒక్క టాలీవుడ్ లోనే వినిపిస్తుందని,ఏ ఇండస్ట్రీలోనూ ఇలాంటి పరిణామాలు లేవని తెలుగు ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు హీరోయిన్స్ కి గ్లామర్ పాత్రలు తప్ప పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న సినిమాలో నటించే అవకాశం రాదని స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు బాలీవుడ్ లో బేబీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో వెంటనే తెలుగు ఇండస్ట్రీపై ఇలా కామెంట్ చేసిందంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.
గతంలో ఇదే మాట హాట్ బ్యూటీ రాధికా ఆప్టే కూడా ఆరోపించింది. తెలుగు ఇండస్ట్రీలో కేవలం హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని హీరోయిన్లను కేవలం గ్లామర్ గా చూడటం రెండు మూడు పాటల వరకే ప్రాధాన్య ఇస్తారని ఆరోపించి సంచలనం రేపింది. తాజాగా తాప్సీ కూడా రాధికా ఆప్టే బాటే పట్టింది.