ఎం.ఎం కీరవాణి సంగీత ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. తన మెలోడీ సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కీరవాణి మ్యూజిక్ నుండి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే కీరవాణి 2016 రిటైర్ అవుతున్నానని అప్పట్లో ఎనౌన్స్ చేశారు. బాహుబలి పార్ట్ 2నే తన చివరి సినిమా అంటూ ప్రచారం జరిగింది. 


ఆ న్యూస్ విని సంగీత ప్రియులంతా కీరవాణి ఇంకా సినిమా సంగీతం కొనసాగించాలని కోరుకున్నారు. వారి కోరిక మన్నించి తన రిటైర్మెంట్ ఆలోచనని వెనక్కి తీసుకున్నాడు కీరవాణి. కీరవాణి రిటైర్ అయితే బాగుండు అనుకున్న వారిలో ప్రస్తుత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నాడట. అలా ఎందుకు అంటే కీరవాణి శిష్యుడైన తమన్ తన దగ్గర ఇప్పటికి పనిచేస్తున్న జీవన్ అనే మ్యుజిషియన్ ను తీసుకోవాలని చూస్తున్నాడట. 


కీరవాణి ఎప్పుడైతే సినిమాలు ఆపేస్తాడో అప్పుడు జీవన్ ను తన దగ్గర పనిచేయడానికి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకే కీరవాణి రిటైర్మెంట్ పై ఎవరెలా ఉన్నా తమన్ మాత్రం అత్యుత్సాహం చూపిస్తున్నాడట. అంతేకాదు జీవన్ నుండి కీరవాణి అప్డేట్స్ అన్ని తెలుసుకుంటున్నాడని టాక్. ఈ విషయం కీరవాణికి కూడా తెలుసని అంటున్నారు. 


ఇక తమన్ అంతగా ఆరాటపడుతున్న ఆ జీవన్ ఇప్పటికే ఈరోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం, లవర్స్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. కీరవాణి దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న జీవన్ సొంత మ్యూజిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: