తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి సినిమా ఇప్పుడు పార్ట్-2 రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిత్రయూనిట్ చేసిన హంగామా అదిరిపోయింది. కీరవాణి అందించిన సాంగ్స్ కూడా సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక ట్రైలర్ అయితే యూట్యూబ్ లో రికార్డుల పని పడుతుంది.


బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అప్పియరెన్స్ గా నిమ్మగడ్డ ప్రసాద్ కనిపించారు. బాహుబలి సినిమా గురించి విదేశాల్లో మనవాళ్లు కాకుండా మిగతా వారు కూడా అడగడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. అయితే సినిమా నిర్మాతల్లో ఒకరైన శోభు నిమ్మగడ్డ ప్రసాద్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. దాని అర్ధం సినిమా నిర్మాణంలో మాట్రిక్స్ ప్రసాద్ అదేనండి నిమ్మగడ్డ ప్రసాద్ కూడా భాగమయ్యాడని అనిపిస్తుంది.


అఫిషియల్ గా కాదు కాని బాహుబలి కోసం ఖర్చు పెట్టిన వారిలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఉన్నాడని టాక్. మొదటి రెండు పార్టులు కలిపి సినిమా 400 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. ఇంతమొత్తం ఆర్కా మీడియా శోభు, ప్రసాద్ ల వల్ల అవుతుందా కాదా అన్నది పక్కన పెడితే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం మాట్రిక్స్ ప్రసాద్ సహకారం తీసుకుని ఉండొచ్చని అంటున్నారు. 


అందుకే నిర్మాతలు నిమ్మగడ్డ ప్రసాద్ కు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సినిమా కచ్చితంగా లాభాలను తెస్తుందనే నమ్మకంతో నిమ్మగడ్డ అభయం ఇచ్చి ప్రొడక్షన్ లో కాస్త ఖర్చు పెట్టి ఉంటాడని ఫిల్మ్ నగర్ టాక్. బిజినెస్ మేన్ అయిన నిమ్మగడ్డ సిని పరిశ్రమతో ఈమధ్యనే కాస్త ఎక్కువ ఎటాచ్ మెంట్ పెంచుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ నాగ్ స్పెషల్ రోల్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన నిర్మలా కాన్వెంట్ నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మాణంలో వచ్చిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: