ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని  ముద్దు పెట్టుకోవాలి అన్న ఆలోచన ఎవరికీరాదు. అదీకాకుండా ఎప్పుడు సీరియస్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చనువుగా మాట్లాడానికి ఆయన సన్నిహితులే బెదిరిపోతు ఉంటారు. అయితే అటువంటి చంద్రబాబుని సినిమానటుడు రాజేంద్రప్రసాద్ ముద్దు పెట్టుక్కున్న సందర్భం  మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు ఓ వింత అలవాటు ఉంది అంటారు.  ఆయనకు ఎవరైనా బాగా నచ్చితే మొహమాటం లేకుండా పబ్లిక్ గానే బుగ్గ పై ముద్దు పెట్టేస్తాడు. గతంలో ఇలాగే ఆయన మెగాస్టార్ చిరంజీవిని కూడా ఓ సన్మానం కార్యక్రమం సందర్భంగా పొగుడుతూ స్టేజీ పైనే  ముద్దుపెట్టడం ఆపట్లో మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పడు లేటెస్ట్ గా రాజేంద్రప్రసాద్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా ముద్దు రావడం వెనుక ఒక కారణం ఉంది. చంద్రబాబు ‘పట్టిసీమ ప్రాజెక్టు’ను విజయవంతంగా పూర్తిచేసి కృష్ణానది నీటిని గోదావరితో కలపడం. తద్వారా దేశంలోనే నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తీసుకురావడం రాజేంద్ర ప్రసాద్ కు ఎంతగానో నచ్చిందట. దీనితో రాజేంద్రప్రసాద్‌ రెచ్చిపోయిన అభిమానంతో చంద్రబాబును ముద్దుపెట్టుకోవడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఉగాది వేడుకల సందర్భంగా సీఎంను కలిసిన రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ  చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తి వేయడమే కాకుండా ‘దేశంలో నదులను అనుసంధానం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. అందుకే ఆయన్ని ముద్దుపెట్టుకున్నాను’ అంటూ మీడియా కెమెరాల ముందు హంగామా చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పడు ఈ ఫోటో ఈనాటి ఉగాది హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: