తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి బద్రి చిత్రంతో దర్శకుడిగా మారారు పూరీ జగన్నాథ్.  ‘ఇడియట్’ చిత్రంతో ఫుల్ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పిలవబడుతున్నాడు.   ఇక ఇజం తర్వాత కొత్త హీరో ఇషాన్ తో ‘రోగ్’ చిత్రం తీశారు..ఈ చిత్రం 31 న రిలీజ్ చేయబోతున్నారు.  ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతున్న పూరీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.  ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ప్రస్తుతం ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.
Image result for పూరి జగన్నాధ్ రోగ్
ఇప్పటికే బాలయ్యతో చేస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన పూరి ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.   బాలకృష్ణ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఏంటో చెప్పేశాడు. ఏకంగా దేవుడి మీదే సినిమా తీస్తాడట. అంటే అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిలా కనిపించినట్టు కాదు. నేటి కాలంలో దేవుళ్ల వల్ల ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో చూపించబోతున్నట్టు పూరీ తెలిపాడు.
Image result for balakrishna puri
అయితే ఇలాంటి వివాదాస్పద అంశాలను ఎంచుకొని చాలా మంది దర్శకులు ఇబ్బంది పడ్డారు.  ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు బాలీవుడ్ లో ‘ఓ మై గాడ్’, తెలుగు లో ‘గోపాల గోపాల’ వచ్చాయి.   మరి, ఈ సినిమాలో దేవుళ్లపై పూరీ పెన్ నుంచి ఎలాంటి పంచులు వస్తాయో చూడాలి. ఇలాంటి సినిమాల విషయంలో మనోభావాల చిక్కులు వచ్చిపడుతుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: