‘కాటమరాయుడు’ ఊహించని విజయాన్ని అందుకోలేకపోయినా పవన్ క్రేజ్ లో ఏమాత్రం తేడారాలేదు అని చెప్పే ఒక ఆశ్చర్యకర సంఘటన టాలీవుడ్ లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం పవన్ పారితోషికం 40 కోట్లకు చేరిపోయింది అని గాసిప్పులు హడావిడి చేయడం అందరి మైండ్స్ ను బ్లాంక్ చేసే వార్తగా మారిపోయింది.

పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ పూర్తి కాకుండానే ఈసినిమా పూర్తి అయిన తరువాత నటించబోయే తన తదుపరి సినిమాకు అప్పుడే లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఈసినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 

సెప్టెంబర్ లో మొదలు కాబోతున్న ఈ మూవీకోసం పవన్ 40 రోజుల కాల్ షీట్స్ ప్రయార్టీ బెసేస్ లో కోరిన నేపధ్యంలో పవన్ తాను నటించవలసిన మిగతా సినిమాలు అన్నీ పక్కకుపెట్టి సెప్టెంబర్ నుండి ఈ మైత్రీ మూవీస్ సంస్థకు 40 రోజులు పనిచేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికోసం సింగిల్ డే కాల్ షీట్ కు కోటి రూపాయల చొప్పున 40 రోజులకు 40 కోట్ల పారితోషికం పవన్ తీసుకుంటున్నట్లు సమాచారం.  

ఈ డీల్ కోసం పవన్ తాను ఇప్పటికే ఒప్పుకున్న ఎమ్.రత్నం సినిమాను పక్కకు పెట్టినట్లు టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయిన ఈసినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈసినిమాను 2018 సంక్రాంతి రేసుకు విడుదల చేయాలని పవన్ ప్లాన్ అని అంటున్నారు. ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వార్తలతో ‘కాటమరాయుడు’ ఫెయిల్ అయినా టాలీవుడ్ లో ఎంపరర్ మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే అన్న విషయాన్ని మరొకసారి రుజువు చేస్తోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: