ఏ పరిశ్రమలో అయినా వారసుల హవా కొనసాగించడం మాములే. హీరోల కొడుకులే కాదు దర్శకుల కొడుకులను, నిర్మాతల తనయులను హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. వారి కోసం ఎక్కడలేని హంగు ఆర్భాటాలను క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తారు. అయితే విచిత్రంగా టాలీవుడ్ డైరక్టర్ తన తనయుడిని మాత్రం ఆఫీస్ బోయ్ ను చేశాడు. ఏంటి ఇదేదో రూమర్ అనుకొకండి నిజమే.


తానో స్టార్ డైరక్టర్ కాని కొడుకుని మాత్రం ముందు ఆఫీస్ బోయ్ గా వచ్చిన అతిథులందరికి కాఫీలు టీలు ఇచ్చిన తర్వాతే తన దగ్గర అసిస్టెంట్ గా చేర్చుకున్నా అని అంటున్నాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్. ఆ స్టేజ్ నుండి కష్టపడితేనే అసలు జీవితం అర్ధమవుతుంది అని పూరి చెబుతున్నాడు. అందుకే తన కొడుకైనా సరే ఉందు సెట్ లో అందరికి టీ అందించాకే సహాయక దర్శకుడు అయ్యాడు అంటున్నాడు. 


పూరి ప్రస్తుతం డైరెక్ట్ చేసిన సినిమా రోగ్.. నిషాన్ హీరోగా చేసిన ఈ సినిమా మార్చి 31న రిలీజ్ అవుతుంది. తన మార్క్ కమర్షియల్ అంశాలతో పాటుగా క్రేజీ లవ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాపై తన ఆశలన్ని పెట్టుకున్నాడు పూరి. ఇక ప్రస్తుతం బాలయ్యతో ఉస్తాద్ సినిమా చేస్తున్నాడు పూరి. ఆ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. 


కొడుకుని సెట్స్ లో కాఫీ టీ అందించిన దర్శకుడు అంటూ పేరు తెచ్చుకున్నా తనయుడిని ఓ గొప్ప దర్శకుడిగానో లేక హీరోగానో చూడాలంటే ఈ మాత్రం చేయక తప్పదని అంటున్నాడు పూరి. ఇక తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి త్వరలోనే ఓ సినిమా చేస్తానని.. ఆ సినిమా కచ్చితంగా మావాడికి ఓ క్రేజ్ తెచ్చి పెడుతుందని చెబుతున్నాడు పూరి. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మొదటి సినిమా చిరుత డైరెక్ట్ చేసింది పూరినే. కాకపోతే ఆకాష్ పూరి ఇప్పటికే ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: