సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటపెట్టట్లేదు. కనీసం సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేయకపోయే సరికి ఫ్యాన్స్ మహేష్ డైరక్టర్ మురుగదాస్ మీద తీవ్ర కోపంతో ఉన్నారు. ఎన్నో డేట్లు మారగా చివరకు ఈ ఉగాది నాడు కూడా నిరాశ చెందిన ఫ్యాన్స్ మురుగదాస్ ను టార్గెట్ చేశారు.


అయితే ఫ్యాన్స్ కోపాన్ని అర్ధం చేసుకున్న మహేష్ కాస్త ఓపిక పట్టండని చెబుతున్నాడు. అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తనకు తెలుసని త్వరలోనే అది రివీల్ చేస్తామని అంటున్నాడు మహేష్. ఫ్యాన్స్ గోల తట్టుకోలేక ఏకంగా మహేష్ ట్విట్టర్ లో ఈ విషయం చెప్పాడు. ఇక మహేష్ ఫ్యామిలీకి చాలా దగ్గరైన పీఆర్వో బి.ఏ.రాజు ద్వారా బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే వియత్నాం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 2న హైదరాబాద్ చేరుకోనుంది మహేష్ సినిమా యూనిట్.   


ఆ తర్వాత టీజర్ లాంచింగ్ డేట్ ఎనౌన్స్ చేస్తారట. అది కూడా ఏప్రిల్ 10లోపే ఉంటుందని టాక్. పండుగ రోజు టీజర్ రిలీజ్ చేయడం మాములే కాని టీజర్ తో పండుగ తీసుకురావడం మహేష్ లాంటి స్టార్ హీరోకే దక్కుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  

భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 23న రిలీజ్ పక్కా అని మురుగదాస్ ఎనౌన్స్ చేశారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: