ఈ మద్య మళియాల నటి భావనపై ఆమె డ్రైవర్ ప్లాన్ ప్రకారం కారులో బంధించి లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై భావన పెద్ద ఉద్యమం చేసింది..అన్ని ఇండస్ట్రీలు ఆమెకు సపోర్ట్ గా నిలిచాయి. అయితే భావన పై లైంగిక దాడి చేసిన వారిని చట్టం శిక్షించింది. ఇక నటి భావన చూపించిన తెగువరకు చాలా మంది హీరోయిన్లు ప్రేరణ పొందారు. గతంలో తమపై జరిగిన లైంగిక దాడులు, ఇండస్ట్రీలో తాము పడ్డ భాదలు ఒక్కోక్కటీ చెబుతున్నారు. ఈ వరుసలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, రేజినా, కస్తూరి ఇలా కొంత మంది హీరోయిన్లు తమను కొంత మంది ఎలా అవమానించారన్న విషయాలు బయట పెట్టారు.
కస్తూరి విషయంలో మరీ దారుణంగా ఓ హీరో ఆమెను కోరకున్నట్లు దానికి ఆమె అంగీకారం తెలపకపోవడంతో రెండు మూడు సినిమా చాన్సులు మిస్సయ్యేలా చేసినట్లు బాధపడింది. తాజాగా ఇదే జాబితోలో మరో హీరోయిన్ చేరింది. మళియాళంలో చాలా తక్కువ సినిమాలు చేసినా విపరీతమైన క్రేజ్ సంపాదించింది పార్వతీ మీనన్. కొంత మంది హీరోలు..నిర్మాతలు..దర్శకుల ‘ఆ’ డిమాండ్ ను అంగీకరించకపోవటం వల్లే తనకు తక్కువ సినిమాలు వస్తున్నాయని కూడా తేల్చారు.
‘పూ’ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైన ఈ మలయాళీ భామ ధనుష్కు జంటగా మరియాన్, ఆర్య, రానా, బాబిసింహాలతో కలిసి బెంగళూర్ డేస్ చిత్రాల్లో నటించారు. కొంత మంది ఆ కోరిక తీర్చాలని తన ముందు ప్రస్థావన తీసుకు రావడంతో తనకు ఇండస్ట్రీపై అసహ్యం పెరిగిందని అన్నారు. అంతే కాదు తమ కోరిక తీర్చలేదన్న అక్కసుతో సినిమాల్లో చాన్సులు రాకుండా చూస్తున్నారని అందుకే తాను చాలా కాలం ఖాళీగా ఉంటున్నానని తేల్చిచెప్పారు. మలయాళంలోనూ నటిస్తున్న పార్వతి ఇటీవల ఒక చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె తనకు జరిగిన అవమానాలు, లైంగిక ఇబ్బందుల గురించి తెలిపారు. హీరోయిన్లతో చిత్ర పరిశ్రమలో ఎలా ప్రవర్తిస్తారన్న ప్రశ్నకు ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనన్నారు. పడక గదికి రమ్మనే చేదు అనుభవాన్ని తాను ఎదుర్కొన్నానని చెప్పారు. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు తనను పలుమార్లు పడక గదికి రమ్మన్నార అన్నారు..అంతే కాదు కొంత మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇదంతా మామూలే అని ఉచిత సలహాలు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.