తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. గత రెండు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ కి గోల్డెన్ టైమ్ నడుస్తుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యార్ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయం సాధించాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మొదటి సారి ఫుల్ లెన్త్ నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోయే ఎన్టీఆర్ కి మరో విలన్ కూడా ఉన్నాడట.
ఇంతకీ ఆ విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. కన్నడంలో యాక్షన్ హిరోగా పేరు తెచ్చుకున్న దునియా విజయ్. ఈ పేరు చెప్పగానే ‘మాస్తిగుడి’ సినిమా షూటింగ్ గుర్తుకు వస్తుంది. అవును ఆ మద్య ‘మాస్తిగుడి’ సినిమా షూటింగ్లో ఇద్దరు స్టంట్ మాన్ లు నీటిలో గల్లంతయ్యారు..తర్వాత చనిపోయారు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మాస్తిగుడి సినిమాలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే సీన్ను రియల్గా తెరకెక్కించే ప్రయత్నం చేసి రెండు నిండు ప్రాణాలు బలికొన్న విషయంలో దునియా విజయ్, ఆయన సినిమా యూనిట్ పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది.
కట్ చేస్తే ఇప్పుడు బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ కి విలన్ గా దునియా విజయ్ ని తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉందని అంటున్నారు..జనతా గ్యారేజ్ తో మళియాళంలో ఎన్టీఆర్ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కన్నడ చిత్ర రంగంలో కూడా తన సత్తా ఏంటో చాటేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. అదే పరిచయాలతో దునియా విజయ్ ని తన సినిమాలో విలన్ గా నటింప చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైను ఫ్యాన్ మాత్రం ఎన్టీఆర్ కి ఈ నిషేధిత హీరోనే తారక్కు దొరికాడా..? అని నందమూరి ఒకింత గుబులు చెందుతున్నారు.