తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన మళియాళ భామ నయనతార ఇప్పటికీ గ్లామర్ గానే కనిపిస్తుంది. అంతే కాదు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకుంటుంది కూడా ఈ భామే. తాజాగా నయనతార లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అనామిక, మయూరి, డోరా లాంటి సినిమాలు అన్నీ లేడీ ఓరియెంటెడ్ కావడం విశేషం. తాజాగా ఈ అందాల తార మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతోంది.
ఈ సినిమా టైటిల్ `వాసుకి`. `పుదియ నియమం` అనే మలయాళ చిత్రానికి అనువాదమిది. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. చిత్రనిర్మాత ఎస్.ఆర్. మోహన్ మాట్లాడుతూ -``ఈ సినిమా నయన్ కెరీర్కే ది బెస్ట్గా నిలుస్తుంది. ప్రతి మహిళా ఈ చిత్రంలో నయనతార పాత్రకు కనెక్ట్ అవుతారు.
మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సంబంధించి.. ప్రస్తుతం తెలుగులో అనువాదం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్లను ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేయనున్నాం. అన్ని పనులు పూర్తి చేసి మేలో సినిమాని రిలీజ్ చేస్తాం. గోపిసుందర్ సంగీతం సినిమాలో హైలైట్గా నిలుస్తుంది`` అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రఓబి వర్గీస్ రాజ్, సంగీతం: గోపి సుందర్, బ్యానర్: శ్రీరామ్ సినిమా, నిర్మాత: ఎస్.ఆర్.మోహన్, దర్శకత్వం: ఎస్.కె.షాజన్.