తెలుగు ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు..అయితే ఏ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరలేదు. దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం 150 కోట్ల వసూళ్లు చేసింది. ఈ చిత్రం ఎంతగా హిట్ అయ్యిందంటే..చాలా సెలబ్రెటీస్ గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ నటించి ‘బ్రహ్మోత్సవం’ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. తాజాగా తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల, మహేష్ సరసన నటించే ముద్దుగుమ్మను వెతికే పనిలో పడి చివరికి బాలీవుడ్ బ్యూటీ ‘కైరా అద్వానీ’ని ఓకే చేశాడట. అయితే మొదట కీర్తి సురేష్ ని అనుకున్నారట..కానీ ఈ అమ్మడి ప్లేస్ లో ఎం.ఎస్.ధోని' చిత్రంతో బాలీవుడ్లో హిట్ కొట్టిన సెక్సీ సుందరి మహేష్కి సరిజోడీలా వుంటుందనే అభిప్రాయానికి కొరటాల రావడంతో కైరా ఫిక్స్ చేసినట్టు సమాచారం...మహేష్ కూడా కైరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
తన మొదటి సినిమా ‘రాజకుమారుడు’ తోనే బాలీవుడ్ భామ ప్రీతీజింతాతో రొమాన్స్ చేసిన ప్రిన్స్.. ఆ తరువాత సోనాలీ బింద్రే, క్రితి సనన్, అమృతారావు, లీసారే, బిపాషా బసు ఇలా బాలీవుడ్ బ్యూటీలతో ఆడిపాడిన మహేష్ లిస్ట్లోకి కొత్తగా కైరా చేరింది. ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. భరత్ అను నేను అనే టైటిల్ ప్రచారంలో ఉండటంతో పాటు.. ఈ సినిమాలో ప్రిన్స్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడనే టాక్ నడుస్తుంది.