ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో మంచి హిట్ సినిమాలు రిమేక్ చేయడం కామన్ అయ్యింది. హిందీలో మంచి హిట్ అయిన సినిమాలు తెలుగులో..తెలుగులో హిట్ అయిన సినిమాలు తమిళంలో రిమేక్ చేస్తున్నారు. సాధారణంగా మంచి కథనం ఉన్న చిత్రాలు ఏ భాషలో తీసినా అవి అక్కడ మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. రీసెంట్ గా మెగా ఫ్యామిలీ తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రాలు వరుసగా రిమేక్ చేస్తూ తెలుగు లో భారీ విజయాలు సాధించారు. ఆ మద్య రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అల్ టైమ్ రికార్డు చిత్రం ‘మగధీర’.
ఈ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్ లో రిమేక్ గా వస్తుంది. సుషాంత్సింగ్ రాజ్పుత్- కృతిసనన్ జంటగా రానున్న ఫిల్మ్ ‘రబ్తా’. షూటింగ్ పూర్తికావడంతో ట్రైలర్ విడుదలైంది. రెండు నిమిషాల నిడివిగల ఈ వీడియో సినీ లవర్స్ విపరీతంగా ఎట్రాక్ట్ చేసుకుంది. 24 గంటల్లో కోటిపైగా హిట్స్ రావడంతో ఫుల్ఖుషీ లో ఉన్నా చిత్ర యూనిట్. గత జన్మ స్టోరీతో వచ్చిన కాన్సెప్ట్ సూపర్హిట్ అయితే మగధీర చిత్రాన్ని బాలీవుడ్ లో ఇన్నాళ్లకు తెరకెక్కించారు.
దోని సినిమాతో మంచి విజయం సాధించిన సుషాంత్సింగ్ రాజ్పుత్ ‘రబ్తా’ చిత్రంతో దుమ్మురేపినట్లు కనిపిస్తుంది. ఇక తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది కృతిసనన్. మొత్తానికి సుషాంత్ యాక్షన్ అదిరిపోయిందని, కృతిసనన్ గత సినిమాల కంటే అన్నివిధాలుగా దూకుడు పెంచిందని అంటున్నారు. ఈ తరహా సినిమాలు బాలీవుడ్లో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి రబ్తా ఏం చేస్తుందో చూడాలి.