బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. షారుక్ చిత్రం ‘మోహబత్తిన్’ చిత్రంతో స్టార్ స్టేటస్ తెచ్చుకుని తెలుగులో ‘ఖడ్గం, మగధీర’ వంటి సినిమాల్లో మెరిసిన కిమ్ శర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్  గా మారారు. తాజాగా ఈ మూవీపై వచ్చిన రూమర్స్ కి తను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ…బిటౌన్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు ఏ మాత్రం ఆగలేదు. అసలు కిమ్ శర్మ పై బిటౌన్ మీడియా ఎందుకు ఫోకస్ పెట్టింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… కిమ్ శర్మ తన భర్త అయిన బడా వ్యాపారవేత్త అలీ పంజానితో విడిపోయిందనేది న్యూస్. అలా విడిపోయినందుకుగాను ఆమెకు ఎలాంటి భరణం దక్కలేదని…దీని కారణంగా కిమ్ శర్మ దిక్కు తోచని స్థితిలో ఉన్నారని అంటున్నారు. అలాగే అలీ పంజాని బాలీవుడ్ కి చెందిన మరొకని ప్రేమిచటంతో కిమ్ శర్మ నుండి విడిపోయారని అంటున్నారు. ఇప్పుడు కిమ్ శర్మ కి ఏం చేయాలో అర్దం కాక ముంబై లో ఏదైనా వ్యాపారం చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.


అయితే వార్తలకి కిమ్ శర్మ తన ట్విట్టర్ ద్వారా కాస్త ఘూటుగానూ, వెటకారంగా సమాధానం చెప్పింది. తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అలాగే ఇవన్నీ ఒట్టి పుకార్లే అని చెప్పుకొచ్చింది. తను ఇంతలా చెప్పినప్పటికీ…బిటౌన్ మీడియా మాత్రం కిమ్ శర్మ పై మళ్లీ రూమర్స్ ని క్రియేట్ చేస్తుంది. గతంలో కిమ్ శర్మ మీడియాను లెక్క చేసేది కాదనేది బిటౌన్ లో వినిపిస్తున్న మాటలు. దీంతో కిమ్ శర్మ ని ఏదొక విధంగా మీడియా కార్నర్ చేస్తూనే వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇది కాస్త ఎక్కువయిందని అంటున్నారు.


అలాగే కిమ్ శర్మ సైతం మీడియాపై ఎప్పుడూ కామెంట్ చేయకపోయినప్పటికీ…ఈసారి మాత్రం కాస్త వెటకారంతో కామెంట్ చేయటంతో బిటౌన్ మీడియా రెచ్చిపోయింది. అలాగే బాలీవుడ్ కి సంబంధించిన సోషియల్ మీడియాలోనూ కిమ్ శర్మ పై రూమర్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి. తను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ…అందరూ మళ్ళీ రూమర్స్ రాయటంతో తన పరిస్థితి మీడియాలో దారుణంగా ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: