తెలుగు ఇండస్ట్రీలోకి బాలీవుడ్ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు..వెళ్తున్నారు. అయితే చాలా కొద్ది మంది మాత్రం తెలుగు ఇండస్ట్రీలో అలాగే నటిస్తున్నారు. అలాంటి వారిలో పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అదా శర్మ ఒకరు. చాలా అమాయకంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తర్వాత వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించినా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ఆ మద్య అదా నటించిన ‘క్షణం’ చిత్రం అద్బుతమైన విజయం సాధించింది.
కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ బాలీవుడ్ భామ స్మైలింగ్ టేబుల్.. అంటూ పైన చూస్తున్న ఫొటోకి సంబంధించిన వీడియో ఒకటి విడుదల చేసింది ఈ బ్యూటీ. అందరికీ తెల్సిన విషయమే ఆదా శర్మకి జిమ్నాస్టిక్స్లో మంచి ప్రావీణ్యం వుందని. తల్లి ద్వారా జిమ్నాస్టిక్స్ నేర్చుకున్న ఆదా శర్మ, చాలా తేలిగ్గానే ఈ ఫొటోకి పోజిచ్చేసిందనుకుంటే అది పొరపాటే. దీనికి కోసం అదా చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందట. అంతే కాదు తన తల్లి వద్ద కూడా ఇందుకోసం బాగానే ట్రైనింగ్ తీసుకుందట.
ఎంత సేపు ఆ భంగిమలో వుండగలదన్న విషయమ్మీద ఒకటికి పదిసార్లు టీమ్ అంతా చర్చించుకుని, ఆ తర్వాత ఓ అవగాహనకు వచ్చి, షూట్ చేశారట. పెర్ఫెక్షన్ కోసం ఒకటికి పదిసార్లు సెటప్ అంతా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చిందని అంటోంది ఆదా శర్మ. ఎలాగైతేనేం, కొన్ని టేక్లు తీసుకున్నాసరే, భంగిమ చాలా పెర్ఫెక్ట్గా వచ్చిందనీ, దాంతో స్టిల్ చాలా చాలా బాగా వచ్చిందనీ ఆదా శర్మ అంటోంది. తన లైఫ్ లో ది బెస్ట్ ఫోటో ఏదీ అంటే ఇదే అంటుంది. ఏది ఏమైనా అదా నీ స్టైల్ కి ఫిదా అంటున్నారు నెటిజన్లు.