తెలుగు ఇండస్ట్రీలో అలనాటి అగ్రహీరోలతో నటించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మహానటి సావిత్రి. నటిగా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా ఆమె జీవితంలో ఎన్నో చెదు అనుభవాలు, కష్టాలు..కన్నీళ్లు మిగిలాయి. తాజాగా ఆ మహానటి జీవిత ఘటనల ఆధారంగా మహానటి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత, కీర్తి సురేష్ కీలక పాత్ల్రో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సమంత విలేకరిగా, కీర్తి సావిత్రిగా నటిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
తాజాగా ఈ సినిమాలో బెంగుళూరు బ్యూటీ అనుష్క నటిస్తుంది. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన అనుష్క ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందీ..ఒకవేళ సావిత్రి టైమ్ లో ఆమెకు పోటీగా ఉన్న జమున పాత్రలో కనిపించనుందా అని అనుకుంటున్నారు. . జమున పాత్రకు అనుష్క సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావిస్తోంది.
అంతేకాకుండా ప్రకాశ్రాజు ఇందులో ప్రముఖ నటుడు, సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో నటిస్తున్నారట. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు భారతదేశ సినీ చరిత్రలో లేని విధంగా భారీ సినిమా సెట్లు సిద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకాబోతోంది.