తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో విశ్వనటుడుగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్.  చీకటి రాజ్యం చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కమల్ హాసన్ ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న రాజకీయాపై తీవ్ర స్థాయిలో స్పందించారు.  అంతే కాదు ఆయన త్వరలో రాజకీయాల్లోకి వెళ్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఆయన శభాష్ నాయుడు చిత్రంతో నటిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా కమల్ హాసన్ మరో వివాదంలో చిక్కుకున్నాడట. 

Image result for కష్టాల్లో పడ్డ కమల్ హాసన్..!

వల్లియూర్‌ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5న హాజరు కావాలని ఆదేశించింది. హిందూ మక్కల్‌ కట్చి ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. మహాభారతంపై  ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ మతాన్ని కించపరిచేవిధంగా ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు.  ఆ మద్య ఓ టీవి చానెల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ..ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతున్న సమయంలో ‘‘మహాకావ్యంగా భావించే ఆ మహా గ్రంథంలో ఓ మహిళ తీవ్ర అన్యాయానికి గురైంది. పాంచాలిని జూదంలో పావులా వాడుకున్నారు.


            కమల్ పై కేసు నమోదు..!

అయినా సరే.. ఓ మహిళను పావులా వాడుకున్న ఆ గ్రంథాన్నే భారత్ ఇంకా గౌరవిస్తూనే ఉంది. ఎందుకు?’’ అంటూ ఆయన మహాభారతంపై తన మనసులో భావాన్ని వ్యక్తం చేశారు.  ఇక  హిందూవులు ఎంతో గౌరవించే మహాభారతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం  తప్పని..ఆయకు దమ్ముంటే.. ముస్లిం, క్రైస్తవులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా? అని తమిళ హిందూ సంస్థ మక్కల్ కచ్చి (హెచ్ఎంకే) చాలా సీరియస్ అయ్యింది.   మొత్తానికి వల్లియూర్‌ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5న హాజరు కావాలని ఆదేశించింది. హిందూ మక్కల్‌ కట్చి ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: