తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. తాత అల్లు రామలింగయ్య వారసత్వం పునికి పుచ్చుకున్న ఈ యంగ్ హీరో కామెడీ, యాక్షన్, డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. గత సంవత్సరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. `రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్.
ఇక `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేస్తున్నారు.
నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ - ``ఆర్య, పరుగు వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో చేస్తోన్న హ్యాట్రిక్ మూవీ `డిజె దువ్వాడ జగన్నాథమ్`. మా బ్యానర్లో రూపొందుతోన్న 25వ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో బన్నిని సరికొత్త లుక్లో చూస్తారు. అల్రెడి విడుదలైన టీజర్కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.