టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ శ్రీనువైట్ల. అయితే ఆగడు  మూవీ తరువాత శ్రీనువైట్ల కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. దీంతో పాపులర్ డైరెక్టర్ శ్రీను వైట్ల కెరీర్ ప్రస్తుతం డల్ గా సాగుతోంది. ఇక తాజాగా వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వచించిన మిస్టర్ చిత్రం సైతం బాక్సాపీస్ వద్ద సరైన రిజల్ట్ ని అందుకోలేకపోవటంతో  శ్రీనువైట్ల మరోసారి సక్సెస్ కాలేకపోయాడు.


నిజానికి మెగాహీరో వరుణ్ తేజ్ వంటి హీరోతో సినిమా దొరకటం అనేది శ్రీనువైట్ల కి నిజంగా లక్ అని చెప్పవచ్చు. కానీ వరుణ్ తేజ్ మూవీని సైతం శ్రీనువైట్ల సరిగా చేయలేకపోవటంతో ఇది శ్రీనువైట్ల కెరీర్ పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే మిస్టర్ మూవీకి సంబంధించిన రిజల్ట్స్ పై ఇండస్ట్రీలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీనువైట్లపై ఎక్కవుగా వినిపిస్తున్నాయి.


భవిష్యత్తులో శ్రీనువైట్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదంటూ కొందరు నమ్మలేని రూమర్స్ ని క్రియేట్ ని చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రీనువైట్ల పై వస్తున్న టాప్ రూమర్స్ ని చూస్తే…ఫిల్మ్ కెరీర్ పై నమ్మకం లేని శ్రీనువైట్ల సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని చూస్తున్నాడట. అలాగే శ్రీనువైట్ల బుల్లితెరకు సంబంధించిన ఓ షోని స్టార్ట్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్ వైవా హర్షతో శ్రీనువైట్ల ఓ బుల్లితెర షోని స్టార్ట్ చేస్తారని అంటున్నారు.


అయితే శ్రీనువైట్ల కి సంబంధించిన సన్నిహితుల వద్ద నుండి తెలుసుకున్న వివరాల ప్రకారం ఇదంతా శ్రీనువైట్ల పై ఎవరో కావాలని చేస్తున్న దుష్పచారం అని అంటున్నారు. శ్రీనువైట్ల పై ప్రస్తుతం మార్కెట్ లో వస్తున్న వార్తలు అన్నీ రూమర్స్ అని అంటున్నారు. ఇక తనకి మంచి సక్సెస్ లు ఎందుకు రావటం లేదు అనే దానిపై శ్రీనువైట్ల ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. తన టీంలోకి కొత్త వ్యక్తులను తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే పాత టీం  అయిన కోనవెంకట్ తో సంప్రదింపులు జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా కోనవెంకట్, గోపిమోహన్ వంటి రచయితలు తన టీం నుండి బయటకు వెళ్లిన తరువాత శ్రీనువైట్ల ఫిల్మ్ కెరీర్ ఏమంత బాగోలేదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: