దర్శకధీరుడు రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం.. బాహుబలితో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నా ఇప్పటికి మహాభారతం తాను అనుకున్న స్థాయిలో తీసేందుకు తన అనుభవం సరిపోదని అంటున్నాడు రాజమౌళి. మహాభారతం ఎనౌన్స్ చేసి పదేళ్ల తర్వాత ఆ సినిమా కచ్చితంగా తీస్తా అని అన్నాడు.


ఈలోగా బాలీవుడ్ షారుఖ్ ఖాన్ మహాభారతంతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. ఇక మోహన్ లాల్ కూడా మహాభారత కథతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఎట్టకేలకు రాజమౌళి నోరు విప్పాడు. మహాభారతం అనేది ఓ సముద్రం అది ఎవరైనా చేసేయొచ్చు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాహుబలి-2 ప్రమోషన్స్ మీదే తప్పకుండా తన నుండి మహాభారతం వస్తుందని అన్నాడు జక్కన్న.


రాజమౌళి అంత ధీమాగా చెప్పాడు అంటే పదేళ్లు కాదు ఆ తర్వాత మరో ఐదేళ్లు అయినా సరే కచ్చితంగా తాను మహాభారతం తీసే తీరుతా అని గట్టిగా చెబుతున్నాడు. ఇక బాహుబలి మొదటి పార్ట్ తో ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న రాజమౌళి బాహుబలి-2 తో అంతకుమించిన కలక్షన్స్ రాబట్టేలా చూస్తున్నాడు.


1000 కోట్ల కలక్షన్స్ టార్గెట్ తో వస్తున్న బాహుబలి-2 అది సాధినిచడం పెద్ద కష్టం ఏం కాదని అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన సాహోరె ప్రోమో సాంగ్ సినిమా మీద అంచనాలను పెరిగేలా చేసింది. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురిచి దేశంలోని సిని ప్రియులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: