‘బాహుబలి’ పార్ట్ వన్ లో రాజమౌళి ఒక చిన్న పాత్రలో కనిపించాడు. దీనితో ‘బాహుబలి 2’ లో కూడ రాజమౌళి మరో చిన్న పాత్రలో కనిపిస్తాడు అని అందరు ఊహించుకుంటున్నారు. అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ రాజమౌళి తన కూతురు మయూఖను ‘బాహుబలి 2’ లో చూపించబోతున్నాడు. 

ఈ విషయం నిన్న విడుదలైన ‘సాహోరే బాహుబలి’ పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ వీడియోలో తెలిసి పోయింది. నిన్న విడుదలైన ఈ పాటకు సంబంధించి అదిరిపోయే గ్రాఫిక్స్, అద్భుతమైన సీన్స్ తో కలగలిపిన ఈ సాంగ్ ప్రోమో అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఈపాట ప్రోమోను జాగ్రత్తగా చూసిన వారికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. 

ఈపాటలో ‘బాహుబలి’ పై పూలు విసురుతున్న ముగ్గురిలో ఎడం నుండి కుడికి చూసినట్లయితే రాజమౌళి కూతురు మయూఖ ఆమె పక్కన కాస్ట్యూమ్ డిజైనర్  ప్రశాంతి కూతురు అనన్య ఆ పక్కన కీరవాణి కూతురు కుముద్వతి లు కనిపిస్తారు. వీరితోపాటు ముందు వరసలో ప్రభాస్ పై పూలు జల్లుతున్న ఇద్దరు చిన్నారులు కూడ కనిపిస్తారు. 

వారిద్దరూ  సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పిల్లలు. ఇది ఇలా ఉండగా ఈరోజు రమారాజమౌళి తన కుటుంబ సభ్యుల పిల్లలతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి కుమార్తె మయూఖ కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టింది. తనకు మంచి సింగర్ అవ్వాలన్న కోరిక ఉందని అందుకనే తాను కర్నాటక సంగీతం నేర్చుకుంటున్నాను అని చెపుతూ ఎప్పటికైనా తాను సినిమా సింగర్ గా మారతాను అన్న సంకేతాలు ఇచ్చింది. 

అంతేకాదు తన స్కూల్ లోని టీచర్లు అంతా తనను చూసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని గుచ్చిగుచ్చి అడిగినప్పుడు తనకు సమాధానం చెప్పినా తన టీచర్స్ నమ్మలేదు అన్న మరొక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. ఇప్పటికే రాజమౌళి కొడుకు కార్తికేయ రాజమౌళి వారసుడుగా రూపు దిద్దు కుంటున్న నేపధ్యంలో ఇప్పుడు మయూఖ కూడా కూడ రాజమౌళి వారసత్వాన్ని కొనసాగిస్తోంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: