గత కొన్ని రోజులుగా తమిళనాడు రైతులు చేస్తున్న నిరసనకు అక్కడి సినీ ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఢిల్లీలో చేస్తున్న వారి నిరసన ప్రదర్శనకు ఇప్పటికే ఎంతో మంది సంఘీభావం కూడా తెలిపారు. అంతే కాదు హీరో విశాల్, ప్రకాశ్ రాజ్ లాంటి వారు స్వయంగా అక్కడకు వెళ్లి రైతులతో కలిసి మాట్లాడి వారితో పాటు నిరసన తెలిపారు. గత సంవత్సరం భారీ వర్షాలుతో నష్టపోయిన రైతులు, పంటలు సరిగా పండినా గిట్టు బాటు రాని రైతులు..ఇలా రైతు సమస్యలపై వినూత్న రీతిలో పోరాడుతున్నారు.
తాజాగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన పదిమంది తమిళ రైతులకు నటి స్నేహ దంపతులు రూ. 20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తమను ఆదోకోవాలని కేంద్రాన్ని కోరుతూ గత 41 రోజులుగా ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద తమిళ రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం వారు తాత్కాలికంగా తమ ఆందోళనను విరమించారు. కాగా ఢిల్లీలో ఆందోళనలో పాల్గొన్న పదిమంది రైతులకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
అయితే ఇప్పటి వరకు తమిళనాడులో రైతులకు సంఘీభావం తెలిపారే కానీ ఎవ్వరూ సహాయం చేయకపోవడం విశేషం. కానీ స్నేహ మాత్రం ఏకంగా 20 లక్షల సాయం చేసి బడా హీరోలకు షాక్ ఇచ్చారు. ఇక నైన స్నేహ ను చూసి మరింత మంది సినీ నటులు ముందుకు వస్తే కనీసం ఆ రైతులకు కాస్తయినా మంచి పని చేసినవారవుతారని పలువురు కోరుకుంటున్నారు.