పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కూడా మాస్ మసాలా ఐటమ్ సాంగ్ హడావుడి చెయ్యబోతోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కూడా మారుతున్న నేటి యువతరం అభిరుచులకు అనుగుణంగా ఎందుకైనా మంచిదని కాబోలు దర్శకుడు త్రివిక్రమ్ ఒక ఐటమ్ సాంగ్ ను చూపిస్తున్నాడు. ‘మిర్చి’ సినిమాలో ‘మిర్చి మిర్చి’ అంటూ ధియేటర్ లలో కూర్చున్న ప్రేక్షకుల చేత ఈలలు వేయి౦చిన హంసానందిని ఈ ఐటమ్ సాంగ్ లో పవన్ తో జతకట్టబోతోంది.

మిర్చి సినిమా విజయం తరువాత చాలా పెద్ద పెద్ద సినిమాలలో హంసానందిని కి ఐటమ్ సాంగ్స్ చేసే అవకాశాలు వచ్చినా ఆమె ఆ ఆఫర్స్ కు ఏమి అంగీకరించలేదు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న హంసానందిని ని పవన్ సినిమా కోసం ప్రత్యేకంగా ఆమెను ఆ దేశం నుండి తీసుకువచ్చి ఐటమ్ సాంగ్ చిత్రికరిస్తారట. ఐటమ్ సాంగ్స్ అంటేనే వద్దు అంటున్న హంసానందిని కూడా పవన్ తో డాన్స్ అనేసరికి సై అని అన్నదట. ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈ పాటను త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్ ఇచ్చేలా చిత్రికరించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని టాక్. ‘గబ్బర్ సింగ్’ లో కేక్కుకేక పెట్టించిన పవన్, హంసానందిని తో మరి ఎటువంటి కేకలు పెట్టిస్తాడో చూడాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: