రాజమౌళి ఇప్పటి వరకూ తెరకెక్కించిన చిత్రాలకి సంబంధించిన కథ…రిలీజ్ వరకూ బయటకు రాలేదు. తన మూవీలకి సంబంధించిన కథలను ముందే లీక్ చేసే పద్దతి తనకి ఉండదు. కొంత మంది అయితే కథని ముందే చెప్పేస్తారు. కానీ రాజమౌళి అందుకు వ్యతిరేకం. అయితే తాజాగా బాహుబలి2 కి సంబంధించిన కథలోని కొన్ని సన్నివేశాలు బయటకు వస్తున్నాయి.


ఇదిలా ఎలా సాధ్యం అనే విషయం రాజమౌళికి అంతుపట్టడం లేదు. ఇందుకు రాజమౌళి ఓ ప్రత్యేకమైన కమిటీని వేసి…ఎవరు ఈ విధంగా సీన్స్ ని లీక్ చేస్తున్నారో కనిపెట్టమన్నారంట. దీంతో ఆ కమిటీ కనిపిపెట్టిన విషయంలో ఓ షాకింగ్ న్యూస్ ఉంది. బాహుబలి2ని చూసిన సెన్సార్ టీం వారు కథలోని కీలక సన్నివేశాలను లీక్ చేస్తున్నారు.


ఇప్పుడు ఆ న్యూస్ చాలా వేగంగా బయటకు వ్యాప్తి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలౌతున్న ఈ మూవీ గురించి ప్రేక్షకుడు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో బాహుబలి2 సీన్స్ కి సంబంధించిన న్యూస్ లను వింటే కథపై కొంత ఆసక్తి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంపై దృష్టి సారించిన రాజమౌళి… బాహుబలి2 సెన్సార్స్ చేసిన వారికి డైరెక్ట్ ఫోన్ కాల్  చేశారని అంటున్నారు.


రిలీజ్ వరకూ బాహుబలి2 కి సంబంధించిన సీన్స్ ని ఎవ్వరీకి చెప్పకూడదని స్ట్రీక్ట్ గా చెప్పాడంట. అంతే కాకుండా అవసరమైతే దీనిపై లీగల్ గా వెళతాం అని కూడ చెప్పాడంట. దీంతో సెన్సార్ టీం వారు ఒక్కసారిగా షాక్ అయ్యారని అంటున్నారు. ఇక బాహుబలి ది బిగినింగ్ సాధించిన ప్రభంజనంతో బాహుబలి2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకే బాహుబలి2 సినిమా రిలీజ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠత మరింత ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో ఈ సినిమా పై లీక్‌లు బయటకు రాకుండా రాజమౌళి అన్నీ రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: