దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి2. ఈ మూవీకి సంబంధించిన కథ ఏమై ఉంటుందనేది ప్రేక్షకుల ఆసక్తి. బాహుబలి మొదటి భాగాన్ని చూసిన వారికి రెండో భాగం కథ ఏమై ఉంటుంది అనేది కొంత వరకూ తెలుసు. కానీ బాహుబలి మొదటి భాగం సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన తరువాత… బాహుబలి2 లోని కథని పూర్తిగా మార్చారు.


దీని కారణంగా బాహుబలి2 కథ ఈసారి కొత్తగా ఉండనుంది. బాహుబలి2 కథ కొత్తగా ఉండటమే కాకుండా యాక్షన్ సన్నివేశాలు బాహుబలి మొదటిభాగం కంటే ఎక్కవుగా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…బాహుబలి2 కథ దాదాపు ఇలాగే ఉంటుందనేది ఓ వీడియోని చూస్తే తెలుస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. తాజాగా రాజమౌళి బాహుబలి2కి సంబంధించి కార్టూన్ వీడియోని రిలీజ్ చేశారు.


ఆ కార్టూన్ సిరీస్ లోని కథ ఎలా ఉందో…దానిలో కొద్దిపాటి మార్పులతో నిజమైన సినిమా కథ ఉంటుందని అంటున్నారు. అందుకే చాలా మంది బాహుబలి2 యానిమేషన్ వీడియోని చూస్తున్నారు. బాహుబలి2కి సంబంధించిన మూవీ కథ ఈ యానిమేషన్ సిరీస్ లోనిదే అని రాజమౌళి ముందే చూపించాడని అంటున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది ఈ యానిమేషన్ వీడియోని చూడలేదు. ఇక ఇండస్ట్రీలో ఈ వీడియోని చూసిన వారు మాత్రం… బాహుబలి2 కథలోని సగం స్టోరీని రాజమౌళి ఇందులోనే చూపించడాని అంటున్నారు. ఇక బాహుబలి2 మూవీ రిలీజ్ విషయానికి వస్తే….సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బాహుబలి2 విడుదలపై నెలకొన్న గొడవలు ఇటీవల సద్దుమణిగిన సంగతి తెలిసిందే.


దీంతో కర్ణాటకలోనూ బాహుబలి2కి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభంకి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నాలుగు రోజుల ముందే ఇతర ప్రాంతాలకి సంబంధించిన బాహుబలి2 అడ్వాన్స్ బుకింగ్ లు మొదలైనాయి. వీటికి విశేషమైన స్సంధన వస్తుంది.  ఒక వారానికి అడ్వాన్స్ బుకింగ్ ముగియడంతో సినీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తొలిరోజు సినిమా చూసేందుకు ప్రేక్షకులు పలు మార్గాల్లో తమతమ ప్రయత్నాలను మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.



మరింత సమాచారం తెలుసుకోండి: