యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. 


దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు సూపర్ హిట్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన తారక్ జనతా గ్యారేజ్ తన కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ వసూళు చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఆ క్రమంలో జై లవకుశ సినిమాను కూడా అదే సెంటిమెంట్ తో ఆరోజే రిలీజ్ చేయాలని చూస్తున్నారట.


ముందు ఆగస్ఠులో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నా ఆ టైంకు రావడం కష్టమే అని అంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత సినిమాల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్న తారక్ ఈసారి కూడా పక్కా హిట్ ఫార్ములాతో వస్తున్నాడు. సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ ను అలరించేలా ఉంటుందని అంటున్నారు.


రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీరామనవమికి టైటిల్ పోస్టర్ తో వచ్చిన జై లవకుశ సినిమా టీజర్ మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని టాక్. మరి హిట్ సెంటిమెంట్ తో ఎన్.టి.ఆర్ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: