జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి బాలకృష్ణకు మధ్య సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్న నేపధ్యం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపధ్యం లో తన బాబాయి బాలకృష్ణ సినిమాతో పోటీగా తన సినిమా విడుదల అవ్వడానికి జూనియర్ పెద్దగా ఆసక్తి కనపరచడంలేదు అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 

గత ఏడాది జూనియర్ తన ‘నాన్నకు ప్రేమతో’ మూవీని  బాలకృష్ణ ‘డిక్టేటర్’ తో పోటీగా విడుదల చేయాడానికి పెద్దగా ఇష్టపడకపోయినా నందమూరి వార్ తప్పలేదు. దీనితో ఆ రెండు సినిమాలు ఎంతో కొంత నష్ట పోయాయి అన్న అభిప్రాయం నందమూరి  అభిమానులలో ఉంది. 

ఈ నేపధ్యంలో తిరిగి జూనియర్ తన లేటెస్ట్ మూవీ ‘జై లవ కుశ’ ను అనుకోకుండా మళ్ళీ నందమూరి వార్ వైపు నడిపిస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జూనియర్ ‘జై లవ కుశ’ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ అన్నది లేకుండా చాల నిర్విరామంగా జరుగుతూ ఉన్నా జూనియర్  త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా కాబట్టి మరీ అంత వేగంగా ఈ సినిమా షూటింగ్ కదలడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈసినిమాకు సంబంధించి ముందుగా అనుకున్న ఆగష్టు 11 రిలీజ్ డేట్ డౌట్ అన్న వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం 'లవకుశ'కు కొత్త డేట్ వినిపిస్తోంది. 'జనతా గ్యారేజ్'ను రిలీజ్ చేసిన సెప్టెంబరు 1నే 'జై లవ కుశ'ను రిలీజ్ చేయాలని జూనియర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెంటిమెంట్ గా ఈ రిలీజ్ డేట్ వల్ల ‘జై లవ కుశ’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జూనియర్ నమ్మకం అని అంటున్నారు.

అయితే అదే నెలలో సెప్టెంబర్ 28న దసరాను టార్గెట్ చేస్తూ బాలకృష్ణ పూరి జగన్నాథ్ ల మూవీ కూడ విడుదల అవుతున్న నేపధ్యం జూనియర్ కు మరొక సమస్యగా మారింది అని టాక్. ఒకవైపు ‘జనతా గ్యారేజ్’ సెంటిమెంట్ మరొక వైపు నందమూరి వార్ పట్ల అయిష్టత ఈ రెండిటి మధ్య జూనియర్ తన ‘జై లవ కుశ’ ను సెప్టెంబర్ 1న విడుదల చేయాలా ? వద్దా అన్న సందిగ్ధంలో ప్రస్తుతం జూనియర్ అన్న ఆలోచనలు ఉన్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: