తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా ‘చిరుత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరో రాంచరణ్.  నటుడిగా చాలా తక్కువ సినిమాలు తీసినా దాదాపు అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేసుకున్నవే కావటం విశేషం.  అయితే గత మూడు సంవత్సరాల నుంచి మాత్రం చరణ్ కి రెండు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి..కానీ గత ‘ధృవ’ చిత్రం మరోసారి విజయఢంకా మోగించింది.  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

ఆ సమయంలో చరణ్ ని కలవడానికి అక్కడ గ్రామ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.  తనను కలిసిసేందుకు వస్తున్న ఫ్యాన్స్ తో.. తన బాబాయి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలని కోరుతున్నాడట. రాజకీయంగా నైనా సరే, లేదా మరే విధంగా నైనా సరే ఆయనకు మద్దతు పలకండి అని సూచిస్తున్నాడట.  దీంతో గత కంత కాంలగా మెగా ఫ్యామీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఏవీ లేవని తెలిసిపోతుంది.  అంతే కాదు గత సంవత్సరం నుంచి పవన్ కళ్యాన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి మెలిసి తిరుతుగున్న విషయం తెలిసిందే.  
Related image
రాంచరణ్ లో  ఎప్పుడూ ఇలాంటి తీరును తామెవరూ  చూడలేదని, ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏనాడూ అభిమానులను ఇలా కోరిన దాఖలాలు లేవన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక నాగబాబు  తన సపోర్ట్ జనసేనకేనని ఇదివరకే ప్రకటించాడు. తాజాగా చరణ్ ఇలా కోరడం మాత్రం వచ్చే ఎన్నికల్లో  బాబాయి నేతృత్వంలోని  జనసేన పటిష్టత కోసమేనా అని చెవులు కొరుక్కుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: