సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి..ఇక కొన్ని సినిమాలు అయితే జంతువులకు ప్రాధాన్యత ఇస్తూ తీసిన సినిమాలు ఉన్నాయి. ఇక తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ‘ఈగ’ చిత్రంలో దాని హీరోయిజం చూపించి అందరిచే ఔరా అనిపించుకున్నాడు.   ముఖ్యంగా పాము, కుక్క,ఏనుగు,గుర్రం, కోతి ఇలా రక రకాల పక్షులు, జంతువులతో సినిమాలు తీశారు. ముఖ్యంగా పాముతో తీసిని సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి.  అప్పట్లో దర్శకులు విఠలాచార్య అయితే ప్రతి సినిమాలో ఏదో ఒక జంతువును ఖచ్చితంగా తన సినిమాలో ఉంచే వారు.  

ఈ మద్య విభిన్న కథనాలతో సినిమాలు తీస్తున్న దర్శకులు రవిబాబు కూడా ఓ పందిపిల్లపై సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆ పంది పిల్లను పట్టుకొని ఆయన ప్రమోషన్ వర్క్ కూడా చేస్తున్నారు.  త్వరలో ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది.  తాజాగా తమిళ ఇండస్ట్రీలో ఓ పందిని హీరోగా చూపిస్తూ సినిమా తీయబోతున్నారట.  

అయితే ఈ తమిళ పంది వ్యాపార దృక్పధం తోనే మన పక్కనున్న దేశాలు మనతో స్నేహాన్ని కోరుకుంటున్నాయి అని వాళ్ళ స్వార్థం ఏంటో తెలియజెప్పే కథాంశం తో ఈ పంది రెడీ అవుతోందట.  తెల్లపంది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జగన్ సాయి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈగ ఎంతటి సంచలనం సృష్టించిందో మా పంది కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర యూనిట్ .
  



మరింత సమాచారం తెలుసుకోండి: