ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి ఎదగాలంటే అది అంత చిన్న విషయం ఏ మాత్రం కాదు. ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వెళితే కానీ ఉన్నతమైన స్థానం దక్కదు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ ఉన్నతమైన స్థానం ను పొందాలంటే హీరోయియిన్స్ కి రాత్రికి రాత్రే పొందవచ్చు. మరికొందరికి ఇంకొంత సమయం పట్టవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ వారి స్థాయిలో కష్టపడి పైకి వచ్చినవారే ఉంటారు.


ఓ స్థాయి స్టార్ డం వచ్చిన తరువాత వీరు ప్రతి ఒక్కరి నుండి రెస్పెక్ట్ కోరుతారు. ఎక్కడన్నా తేడా వచ్చిందంటే మాత్రం వారి అంతు తేలుస్తారు. ఈ తరహా సంఘటన బాలీవుడ్ ఒకటి జరిగింది. దానికి సంబంధించిన టాక్స్ రీసెంట్ గా హాట్ హాట్ గా మారినప్పటికీ…ఈ విషయంపై ఎటువంటి పరిష్కారం ఇంకా జరగలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలోకి వెళితే సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల విషయం ఎక్కువగా ఉంటుంది. పలువురు హీరోయిన్స్ ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు.


కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ సైతం ఆ ఇండస్ట్రీ హీరోలపై విరుచుపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ నటి శిల్పా షిండే ముందుకు వచ్చి తనను నిర్మాత సంజయ్ కోహ్లీ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇద్దరి వైపునుండి వాదనలు వినిపించారు. ఈ విషయంలో శిల్పా షిండే  చెప్పిన మాటలు ప్రకారం…నేను ఎన్నో ఎదుర్కొన్నాను. నా స్థానంలో ఎవరైనా ఉంటె వారు ఆత్మహత్య చేసుకునేవారు అంటూ స్పందించింది? నేను డబ్బు కోసమో లేక మరొకదానికోసమో ఇదంతా చేస్తున్నట్టు ఇతరులు అనుకుంటారు.


కానీ ఇలాంటి విషయం పై మాట్లాడడం అంత సులభం కాదని, ఈ విషయం పై పిర్యాదు చేస్తే ఇంత ఆలస్యంగా ఎందుకు చేశావని ప్రశ్నిస్తారని కౌంటర్ వేసింది. బాబీ ఘర్ పర్ హై షో నుండి తప్పుకున్నానని,సంజయ్ అతని భార్య బెనాఫేర్ కూడా తనను మానసికంగా వేధించారని గతంలో పేర్కొన్నారు. అయితే ఈ షో కోసం తనకి రావాల్సిన 32 లక్షలను సంజయ్ ఇవ్వకుండా తనతో ఎఫైర్ పెట్టుకోవాలని చూశాడంట. దీంతో శిల్పా షిండే సంజయ్ పద్దతిని మార్చుకోవాలని ఎన్నో సార్లు చెప్పినా వినలేదంట. ఇక చేసేది లేక చివరకు కంప్లైంట్ వరకూ వెళ్ళింది. అయితే దీనికి సంబంధించిన విషయం మీడియాలో ప్రతి రోజు హాట్ టాపిక్ గానే మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: