కళాతపస్వీ కె. విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనవాస్ స్వయంగా కె. విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ..వెస్టన్ సంగీతం మారుమోగుతున్న సమయంలో ‘శంకరాభరణం’ లాంటి సంగీతభరిత చిత్రాన్ని తీసి భేష్ అనిపించుకున్న ఘనత ఆయనకే దక్కిందని..ఆ సినిమా ఎన్నో సార్లు చూశానని అన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఇంత గొప్ప దర్శకులు ఉండటం ఇండస్ట్రీ అదృష్టం అని ఆయన గురించి మాట్లాడే అంత గొప్ప వాన్ని కాదు అని అన్నారు. అంతే కాదు కె. విశ్వనాథ్ కు మా కుటుంబంతో ముఖ్యంగా అన్నయ్యతో మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయనకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతున్నా.
ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వరించాల్సింది. కానీ కాస్త ఆలస్యమైన అవార్డు ఆయనకు రావడం సంతోషంగా ఉంది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు గానీ, మేము మాత్రం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. ఆయనకు అవార్డు రావడం తో ఆ అవార్డుకే నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా శుభాబివందనాలు తెలుపుతున్నా.