ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న చిత్రం ‘బాహుబలి 2’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు సమాధనం కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కన్నా పది రెట్లు అద్భుతంగా తీర్చి దిద్దామని రాజమౌళి అంటున్నారు.  ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని అందరూ చూసి ఆదరిస్తారన్న నమ్మకు తనకు ఉందని అంటున్నారు.  ఇప్పటికే సినిమా పోస్టర్లు రిలీజ్ చేస్తూ మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు.

 ఓ వైపు టెక్నికల్ టీమ్, హీరో, హీరోయిన్లు అన్ని చానల్స్ లో ఇంటర్వ్యూలతో ఊదరగొట్టేస్తున్నారు.  అయితే వీరి టార్గెట్ మొత్తం ఒక్కటే సినిమా మంచి విజయం సాధించడమే కాదు రికార్డులు తిరిగేసేలా కలెక్షన్లు రావాలి.  కాగా ఈ సినిమా  భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో  రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మొదటి రోజు అవలీలగా వంద కోట్లకు పైగా  రాబట్టగలదని ట్రేడ్ విశ్లేషకులు గోరంట్ల సత్యం తేల్చి చెప్పేసారు . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 900 ల స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం తో కళ్ళు చెదిరే కలెక్షన్లు రావడం ఖాయమని తొలిరోజు రికార్డ్ ని బాహుబలి 2 పేరిట నమోదు కావడం కూడా ఖాయమని అంటున్నారు.  
Related image
ఇక  మొదటి రోజున 100 కోట్ల నుండి 150 కోట్ల మధ్య న వసూల్ చేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం .  అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లని పెంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఆరు ఆటలు తెలంగాణలో 5 ఆటలు పడనున్నాయి దాంతో భారీ వసూళ్లు రావడం ఖాయం . మొత్తానికి మొదటి రోజు నుండే బాహుబలి 2 సంచలనాలకు కేంద్ర బిందువు కావడం ఖాయంగా కనిపిస్తోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: