కోటాను కోట్ల మంది ఎదురు చూస్తున్న బాహుబలి రేపు ఈ పాటికి థియేటర్ లలో ఉంటుంది. ఇవాళ రాత్రే స్పెషల్ ప్రీమియర్ ల రూపం లో మన ముందర కి రాబోతున్న బాహుబలి చిత్రం ఆరొందల కోట్లు సాధిస్తే గానీ బ్రేక్ ఈవెన్ తెచ్చుకోడు అంటున్నారు ట్రేడ్ వర్గాల నిపుణులు. దాదాపు వెయ్యి కోట్ల వరకూ ఈ చిత్రం సంపాదిస్తుంది అని అంటున్నారు. బ్రహ్మాండం బద్దలైనా సరే మొదటి రోజునే ఈ సినిమా చూడాలి అని చెబుతున్నారు అందరూ. బాహుబలి 1 కి మించిన అధ్బుతాలు బాహుబలి 2 లో ఉండబోతున్నాయి అనే న్యూస్ ఇప్పుడు హల్చల్ అవుతూ ఉన్న తరుణం లో .. అబూ దాబీ ప్రీమియర్ లు ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతున్నాయి.


విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండో భాగం మరింత గొప్పగా ఉండ బోతోంది అంటున్నారు. విజువల్స్ అన్నీ ఒక రేంజ్ లో సాగుతాయి అనీ ఇంటర్వల్ బ్యాంగ్ చిత్రం మొత్తానికే హై లైట్ గా ఉండబోతోంది అని టాక్ నడుస్తోంది. మొదటి భాగం లో రాజమౌళి మిస్ చేసిన ఎమోషన్ ని ఇక్కడ క్యారీ చేస్తాడు. రానా రాజుగా పట్టాభిషేకం చేసుకుని చిత్రానికే అతిపెద్ద ట్విస్ట్ ఇస్తాడు.


ప్ర‌భాస్ – అనుష్క‌, రానా – అనుష్క‌ల‌తో వేర్వేరుగా క‌త్తి యుద్దాలు డిజైన్ చేశాడ‌ట రాజ‌మౌళి. అవి కూడా న భూతో.. అనే స్థాయిలో ఉండ‌బోతున్నాయ‌ని టాక్‌. కట్టప్ప ప్రశ్న కి సమాధానం కూడా సూపర్ ఎమోషనల్ సీన్ ల మధ్యన సాగుతుందట. అస‌లు సినిమా మొద‌లైన కాసేప‌టికే బాహుబ‌లి ని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న ప్ర‌శ్న మ‌ర్చిపోయి ప్రేక్ష‌కులంతా సినిమాలో లీన‌మైపోయేలా కొన్ని ఎపిసోడ్లు రాజ‌మౌళి డిజైన్ చేశాడ‌ని స‌మాచారం. రానా - శివుడు మధ్యన ఫైట్ క్లైమాక్స్ లో వచ్చినా దాని ఎఫెక్ట్ అత్యద్భుతంగా ఉండబోతోంది అంటున్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి: