ఈ మద్య తమిళ సినీ పరిశ్రమలో చాలా విశాదాలు చోటు చేసుకున్నాయి.  తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌కే.విశ్వనాథన్‌(75) మృతి చెందారు.  తమిళనాట ఎన్నో సినిమాలకు దర్శకత్వపు శాఖలో పనిచేసిన ఆయన తర్వాత దర్శకులు గా మారారు.  తమిళనాట పది సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథన్ కు అగ్ర హీరోలు  కమల్ హాసన్ , రజనీకాంత్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి .

చట్టం ఎన్‌ కైయిల్, కడల్‌ మీన్‌గల్, మీన్‌డుం కోకిల, సగాదేవన్‌ మగాదేవన్‌ వంటి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన ఎన్‌కె.విశ్వనాథన్, తరువాత విజయకాంత్‌ నటించిన పెరియమరుదు, నమితం, వడివేలు నటించిన జగన్మోహిని, రామ్‌కి, నిరోషా నటించిన ఇనైంద కైగల్‌ వంటి పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ మంగళవారం గుండెపోటుతో మరణించారు.  ఆయన మృతికి డీఎండీకే నేత విజయకాంత్‌ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  తమిళ సినీ పరిశ్రమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: