ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఒక సంఘటన గురించి వస్తున్న గాసిప్పులలో ఎన్ని నిజాలో తెలియకపోయినా బాలయ్యా జూనియర్ ల మధ్య దూరం మరింత పెరిగింది అన్న సంకేతాలు ఇచ్చే విధంగా ఆ గాసిప్పులు ఉన్నాయి.  బాలకృష్ణతో తిరిగి సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవాలని జూనియర్ అదే విధంగా అతడి సోదరుడు కళ్యాణ్ రామ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం పై చాల వార్తలు వస్తున్నాయి.

అయితే వీరిద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలయ్య మనసు మాత్రం మారడం లేదు అని ఫిలింనగర్ టాక్.  ఈనేపధ్యంలో ఈవిషయానికి సంబంధించి ఒక ఆసక్తికర కథనం ఇప్పుడు ప్రచారంలో ఉంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమాకు సంబంధించి షూటింగ్ నిమిత్తం  సారథి స్టూడియోలోఒక సెట్ వేసారు అని టాక్.  దీనిపక్కనే పూరిజగన్నాథ్ బాలకృష్ణల సినిమా కోసం అదే సారధి స్టూడియోలో మరొక సెట్ ను కూడ వేసారని తెలుస్తోంది.

అయితే ఈ విషయాలు తెలియని బాలకృష్ణ తన కారవాన్ లో సారధి స్టూడియోస్ వద్ద తన షాట్ కొడం వేచి ఉన్నప్పుదు అక్కడ బాలకృష్ణను కలిసిన ఒక ప్రముఖుడు ఇదే సారధి స్టూడియోలో జూనియర్ ‘జై లవ కుశ’ షూటింగ్ కూడ జరుగుతున్న విషయాన్ని యధాలాపంగా బాలయ్యకు చెప్పాడట. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న బాలకృష్ణ దర్శకుడు పూరితో ఈ విషయం పై తన అసహనాన్ని వ్యక్త పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ విషయాలను తెలుసుకున్న నిర్మాత కళ్యాణ్ రామ్ చాల వ్యూహాత్మకంగా వ్యవహరించి సారధి స్టూడియోస్ లో జరగవలసిన ‘జై లవ కుశ’ షూటింగ్ ను సారధి స్టూడియోస్ నుండి అన్న పూర్ణ స్టూడియోస్ కు మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో బాబాయ్ సైలెంట్ హుకుం కు జూనియర్ లో మార్పు వచ్చింది అన్న వార్తలు గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: