ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘బాహుబలి 2’. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన గ్రాఫిక్స్ మాయాజాలం ‘బాహుబలి’ కి సీక్వెల్ గా రూపొందిన బాహుబలి 2 ఈ రోజు రిలీజ్ అయ్యింది. గత నెల రోజుల నుంచి ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. ఇక భారత దేశంలో అయితే ఎక్కడ చూసినా బాహుబలికి సంబంధించిన ముచ్చట్లే కొనసాగాయి. ఈ రోజు విడుదలైన బాహుబలి-2 సినిమా సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే అయితే, బెంగళూరులోని కొందరు అభిమానులకు విచిత్ర అనుభవం ఎదురైంది.
బెంగళూరులోని పీవీఆర్ ఎరీనా మాల్లో నిన్న రాత్రి బాహుబలి ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా ఆ థియేటర్లో సెకండ్ ఆఫ్ను ముందు ప్లే చేశారు. ఇక సినిమా చూస్తున్న అభిమానులకు బాహుబలి, భళ్లాల దేవ ల మద్య యుద్ద సన్నివేశాలు వస్తున్నాయి. అయితే సినిమా ఇలాగే ఉంటుందేమో అనుకుని ఎంతో ఉత్కంఠంగా చూస్తున్న అభిమానులకు కాసేపటి తర్వాత క్లయిమాక్స్ సన్నివేశాలు రావడం సినిమా అయిపోవడం జరిగిందట.
అప్పుడు అర్థమైంది ఆడియన్స్ కి తాము ఇంతసేపు చూసింది బాహుబలి 2 సెకండ్ పార్ట్ అని. బిత్తరపోయిన అభిమానులు థియేటర్ యాజమాన్యాన్ని నిలదీయడంతో అప్పుడు నాలుక్కరుచుకొని తాము ప్లే చేసింది సెకండ్ పార్ట్ అని వెంటనే ఫస్ట్ పార్ట్ ప్లే చేశారు. మొత్తానికి అక్కడి జనాలు బాహుబలి రెండు సార్లు చూసినట్లయ్యింది.