ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు గొప్ప అనే విషయానికి వస్తే…ఇది ఏ ఒక్కరికీ సొంతం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక్క హీరోలకే సొంతం అని చెప్పవచ్చు. ఇప్పుడు టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ఎందరో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక సినిమా హిట్ కావాంటే మంచి కథల‌ని తీసుకువచ్చే టాలెంట్ ఉన్న దర్శకుడు కావాలనేది హీరోల అభిప్రాయం.

దీంతో హీరోలు ఇప్పుడు డైరెక్టర్స్ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. డైరెక్టర్స్ ని సరిగా చూసుకుంటేనే సినిమా హిట్..లేదంటే సినిమాకి అడ్రస్ ఉండదు…అనే పరిస్థితి ఇండస్ట్రీలో కనిపిస్తుంది. టాప్ హీరో అయినప్పటికీ…కథ విషయంలో ఏముందిలే..అనే ఉద్ధేశంతో ముందుకు వెళితే తనకి భారీ డిజాస్టర్స్ ని ప్రేక్షకులు ఇస్తున్నారు. ఇక తాజాగా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోకి ఓ యంగ్ డైరెక్టర్ తనేంటో చూపించాడని అంటున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…”అల్లుడు శీను” సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ తరువాత చేసిన సినిమాలు అంతగా సక్సెస్ ని సాధించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్, చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ అప్పుడే తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నారు.

నాని తో ”నేను లోకల్” అంటూ సూపర్ హిట్ అందుకున్న త్రినాథ రావు నక్కిన తో బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అయ్యారు. అయితే త్రినాధరావు నక్కిన ఈసారి రెమ్యునేషన్ పెంచేశారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం రెమ్యునరేషన్ పాతదే తీసుకోవాలని కోరగా…పెంచిన రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తాను..అని గట్టిగా చెప్పటంతో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ తో మాట్లాడి  డైరెక్ట‌ర్ డిమాండ్ ని ఒప్పించారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్-త్రినాధరావు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంకి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: