తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యంగ్ హీరోయిన్ల హవా బాగా పెరిగిపోయింది.   ఇప్పటికే రకూల్ ప్రిత్ సింగ్, రాశీ ఖన్నా, రెజినా, లావణ్య త్రిపాఠి లాంటి వారు ఎంట్రీ ఇచ్చి సీనియర్ హీరోయిన్లు త్రిష, నయన్, శ్రియ,కాజల్ లాంటి హీరోయిన్లకు చెక్ పెట్టారు.  ఇక కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, మెహ్రీ‌న్, అనూ ఇమ్మాన్యూయెల్ లాంటి హీరోయిన్లు యంగ్ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారిపోతున్నారు.  తాజాగా కృష్ణగాడి వీరప్రేమగాధ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన  మెహ్రీ‌న్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పాగా వేసింది.  

ప్రస్తుతం రవితేజతో 'రాజా ది గ్రేట్' లో హీరోయిన్ గా చేస్తోన్న మెహ్రీ‌న్ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ అమ్మడు రెండు సినిమా ప్రాజెక్టుల నుంచి తప్పించారని వార్తలు వస్తున్నాయి..అయితే ఆ సినిమా హీరోలు వరుణ్ తేజ్, అల్లు శిరీష్ కావడం విశేషం.  అయితే ఈ సినిమా నుంచి మెహ్రిన్ కావాలనే తప్పుకున్నట్లు సమాచారం.  
Image result for Actress-Mehreen
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఎదుగుతోన్న టైంలో‌‌ చేతి నుండి రెండు సినిమాలు పోవడంతో అందరూ షాక్ కి గురయ్యారట. కానీ అసలు విషయం ఏంటంటే ఈ అమ్మడు కావాలనే ఆ సినిమాల నుంచి తప్పుకున్నట్లు అందు కోసమే డేట్స్ ఇవ్వలేదట. అసలు విషయం ఏంటంటే త్రివిక్రమ్ - తారక్ కాంబోలో రాబోయే మూవీ కోసం మెహ్రీన్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట.  ఒకవేళ ఈ సినిమాలకు కమిట్ అయితే ఆ సినిమాకి ఇబ్బంది ఏర్పడుతందని అందుకే ఆ రెండు సినిమాలని కాదని త్రివిక్రమ్ మూవీకి డేట్స్ ఇచ్చేసిందట మెహ్రీన్.


మరింత సమాచారం తెలుసుకోండి: