స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ `స్పైడ‌ర్`. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ చిత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. అయితే దీనిపై మహేష్ బాబు కాస్త సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...ఇప్పటికే `స్పైడ‌ర్` మూవీ షూటింగ్ ని మొదలుపెట్టి సంవత్సరం అవుతుంది. 

ఇప్ప‌టికీ టాకీ పార్ట్ పూర్తికాలేదు. దీనికి కారణం కొన్ని సీన్స్ ని రీటేక్ చేయటమే అని అంటున్నారు. మహేష్ బాబు మూవీ ఇప్పటి వరకూ పూర్తి కాకపోవటంతో చిత్ర యూనిట్ లోనూ, ఫ్యాన్స్ లోనూ ఈ మూవీపై కాస్త నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు మురుగదాస్ పై ఫైర్ అవుతున్నారు.


ఇక సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో మాత్రం ఈ మూవీ డైరెక్టర్ పై పూర్తిగా నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ తరువాత మహేష్ బాబు `శ్రీ‌మంతుడు` కాంబినేష‌న్‌లో నటించాల్సి ఉంది. కొరటాల శివ ఇప్పటికే చాలా నెలల నుండి మహేష్ బాబు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు...డైరెక్టర్ మురుగదాస్ పై సీరియస్ అయ్యాడంట.


కొద్ది రోజుల్లో `స్పైడ‌ర్` మూవీ షూటింగ్ ని పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టాడని తెలుస్తుంది. దీంతో మురుగదాస్ సైతం ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు. తను కంటిన్యూస్ గా డేట్స్ ఇస్తున్నప్పటికీ...అనుకున్న టైంలో ఎందుకు షూటింగ్ పూర్తి కావటం లేదు? అనేది మహేష్ బాబు ప్రశ్న. దీంతో మురుగదాస్ ఈ మూవీని పూర్తి చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: