దర్శకత్వం వహించింది ఒకేఒక్క సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తో అతడు టాలీవుడ్ టాక్ అఫ్ ఇండస్ట్రీ గా మారిపోయాడు. అతడే విజయ కుమార్. ఇతడి పేరు వినగానే యువకుల హృదయాలను గల్లంతు చేసిన ‘గుండెజారి గల్లంతైందే’ సినిమా గుర్తుకువస్తుంది. సైలెంట్ బ్లాక్ బస్టర్ గా మారిన ఈ సినిమా హీరో నితిన్ కే కాకుండా దర్శకుడు విజయ కుమార్ కి కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. దీనితో మన టాలీవుడ్ నిర్మాతలు, హీరోలే కాదు కోలీవుడ్ హీరోలు కూడా విజయ కుమార్ తో సినిమాలు చెయ్యడానికి ఇష్టపడుతున్నారు.

అంతేకాదు అతడు కోరుకుంటే ఎంతటి భారీ పారితోషికాన్ని అయినా ఇవ్వడానికి నిర్మాతలు క్యూ లో ఉన్నారు. అయినా వియాజ కుమార్ మాత్రం ఏ ఆఫర్ అంగీకరించడం లేదట. ఆఖరుకు కోలీవుడ్ లో ప్రముఖ హీరోలుగా ఉన్న అజిత్, శింబు లాంటి హీరోలు, కన్నడం లో క్రేజీ హీరోగా పేరుగాంచిన పునీత్ రాజ్ కుమార్ ల దగ్గర నుంచి ఆఫర్స్ వస్తున్నా, బ్లాంక్ చెక్ ఇస్తామని నిర్మాతలు చెపుతున్నా మౌన ముద్రలో ఉంటున్నాడట మన విజయ కుమార్. మరి విజయ కుమార్ ఇంత సుదీర్గ మౌన వ్రతానికి కారణం ఏమిటో మరి కొద్ది రోజులు ఆగితేకాని తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: