ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘స్పైడర్’. ప్రస్తుతం ‘స్పైడర్’ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ప్రతి సమ్మర్ లో హాలిడే ట్రిప్ కి వెళ్ళే మహేష్ బాబు ఈ సారి కూడ ‘స్పైడర్’ షూటింగ్ నుండి కాస్త బ్రేక్ తీసుకుని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వివరాలను చూస్తే... కొద్దిగా టాకీ పార్ట్ , ఒకే ఒక పాట బ్యాలెన్స్ ఉంది. మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కానుంది. ఇక మే 31వ తేదీన కృష్ణగారి జన్మదిన సందర్బంగా ‘స్పైడర్’ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ క్రేజ్ ఏర్పడుతుంది.

ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ నటిస్తున్నారు. అయితే ‘స్పైడర్’మూవీలో మహేష్ బాబు భారీగా ఇన్వెస్ట్ మెంట్ పెట్టినట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. మురుగదాస్, మహేష్ బాబు ఇద్దరూ దాదాపు 60 కోట్ల రూపాయలను ఇందులో ఇన్వెస్ట్ చేశారని అంటున్నారు. ఇక మూవీ రిలీజ్ తరువాత ‘స్పైడర్’ టాక్ కాస్త తేడా కొట్టిందంటే వీరిద్దరూ భారీ నష్టపోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

ఇప్పటికే మురుగదాస్ ఈ మూవీ విషయంలో అవుట్ పుట్ సరిగా రాకపోవటంతో కొన్ని సీన్స్ ని రీటేక్ చేస్తున్నారనే టాక్స్ బయటకు వస్తున్నాయి. అందుకే చిత్ర వర్గాల్లోనూ ‘స్పైడర్’మూవీపై గట్టి నమ్మకాన్ని పెట్టుకోలేకపోతున్నాయి. బ్రహ్మోత్సవం మూవీ తరువాత వస్తుతం చిత్రం కావటంతో ఈ మూవీ కచ్ఛితంగా సక్సెస్ ని సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. లేదంటే ఇది మహేష్ కి ఇది వరుసగా రెండో ప్లాప్ ని ఇస్తుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: