పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తాజా సమాచారం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరినీ ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది. వీటి వివరాలను చూస్తే...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఎక్కువుగా కథ ఉంటుంది. ఆ తరువాత కామెడీ సన్నివేశాలకి ప్రాధాన్యత ఉంటుంది.


అయితే తాజాగా తను నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో మాత్రం కొంత పోరాట సన్నివేశాలకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఈ మూవికి సంబంధించిన పోరాట సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ పవర్ స్టార్ కి ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడని అంటున్నారు. త్రివిక్రమ్ ఏదైనా మూవీని కొంత ఆలస్యంతో తెరకెక్కిస్తారు. కానీ ఈ మూవీని మాత్రం శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.


ప్రస్తుతం మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రోగ్రెస్ ఎంత వరకూ అయిపోయిందని త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ అడిగితే...అందుకు త్రివిక్రమ్ దాదాపు 50 శాతం పూర్తయిందని చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ ఇంత వేగంగా షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడా? అంటూ వెంటనే షాక్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఈ మూవీ తరువాత వెంటనే మరో మూవీని చేయాల్సి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కి టైంని సేవ్ చేయాలని త్రివిక్రమ్ మూవీ షెడ్యూల్స్ ని త్వరగా పూర్తి చేస్తున్నాడు.


చేతిలో స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుస షూటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక ఈ మూవీని ఎస్.రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్స్ విషయంలో ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ గోకుల కృష్ణుడు అనే టైటిల్ ఎక్కువగా వినిపిస్తోంది. మొత్తంగా త్రివిక్రమ్ ఈ సినిమాని శరవేగంతో పూర్తి చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ ఇస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: