టాలీవుడ్ దర్శకులలో తన మాటల గారడితో సూపర్ హిట్లు అందుకుంటున్న త్రివిక్రం శ్రీనివాస్ అందరికి సుపరిచితుడే. తను తీసే కథలు గొప్పగా ఉండకపోవచ్చు కాని తను రాసే మాటలు మాత్రం జీవిత సారాంశాన్ని తెలియచేస్తాయి. అయితే తను మాటల రచయితగా ఉన్నప్పుడు విక్టరీ వెంకటేష్ తో ఎక్కువ సినిమాలు చేశాడు. 


వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలకు త్రివిక్రం మాటలను అందించాడు. అయితే దర్శకుడిగా మారిన తర్వాత త్రివిక్రం వెంకటేష్ కలిసి ఓ సినిమా కూడా చేయలేకపోయారు. అప్పట్లో ఇద్దరు కలిసి సినిమా చేసే అవకాశం వచ్చినా వెంకటేష్ డేట్స్ ఖాళీ లేక ఆగిపోయారు.


ఇక ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రం వెంకటేష్ కాంబోలో సినిమా సిద్ధమవుతుందట. పవన్ తో సినిమా పూర్తి చేశాక ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం సినిమాకు సిద్ధమవగా ఆ తర్వాత మాత్రం వెంకటేష్ తోనే సినిమా చేస్తాడని అంటున్నారు. వెంకటేష్ టైమింగ్ కు త్రివిక్రం లాంటి దర్శకుడు మాటలను అందిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం చూశాం. 


కాబట్టి ఈ క్రేజీ కాంబినేషన్ పై కచ్చితంగా అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే వెంకటేష్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. రీసెంట్ గా గురు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ తర్వాత ఏ సినిమా చేయాలో అన్న డైలమాలో ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: