యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మూవీలో పలు కీలక అంశాలు చర్చకు దారితీస్తుంది. బాబీ దర్శకత్వంలో చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన విషయంలో ఓ కీలక మార్పు జరిగింది. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.


ఇక ఆ మార్పుకి సంబందించిన వివరాలను చూస్తే...సినిమాటోగ్రాఫర్ గా సీకే మురళీధరన్ స్థానంలో మరొక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడును తీసుకున్నారు. సినిమా అవుట్ పుట్ కి సంబంధించిన విషయంలో హ్యాపీగా లేని జూనియర్ ఎన్టీఆర్ ఈ మార్పును చూశారని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్వాలిటీ విషయంలో..జూనియర్ హ్యాపీగా లేడంట.


దీని గురించే గతంలో సినిమాటోగ్రాఫర్ మురళీధరన్ తో కొంత చర్ఛలు నడిచాయి. అయితే ఇవి రోజు రోజుకి ఎక్కువుగా మారటంతో ఫైనల్ గా జూనియర్ సినిమాటోగ్రాఫర్ ని మార్చాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దీంతో జై లవకుశ మూవీ తాజా షెడ్యూల్స్ కి సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు పని చేయనున్నారు. అయితే సినిమాటోగ్రాఫర్ మార్పు అనేది ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది.


టెక్నిషియన్స్ కి సంబంధించిన విషయాల్లో ఇంకొన్ని భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: