మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి ఫిక్స్ అయ్యారంటే ఎవ్వరి మాట వినేరకం కాదని అంటారు. చాలా సందర్భాల్లో ఈ విధమైన ధోరణి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు చూశారు. ఆ విధంగానే తాజాగా తన మూవీకి సంబంధించిన ఓ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎవ్వరిమాటని లెక్కచయటం లేదని అంటున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… ఇక మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథను తెరకెక్కిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. అయితే మొదట ఈ మూవీని సాధారణంగా తెరకెక్కించాలని నిర్ణయించారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం లేకుండా కథపైనే ఎక్కువుగా ఫోకస్ పెట్టారు.

కానీ ఇప్పడు కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతని ఇచ్చారు. దీంతో బడ్జెట్ తారాస్థాయికి చేరుకుంది. ఇదంతా బాహుబలి2 సాధించిన విజయాన్ని చూసిన తరువాత బడ్జెట్ ని పెంచేస్తున్నారు. ఈ మూవీని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ లెక్కల ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్ణయించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దీన్ని 130 కోట్ల రూపాయలకి బడ్జెట్ కి ఫిక్స్ చేశారంట.

ఈ విషయంలో రామ్ చరణ్ కి కాస్త చెమటలు పడుతున్నా…మెగాస్టార్ చిరంజీవి మాత్రం బడ్జెట్ తగ్గేది లేదని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కాన్ఫిడెంట్ గా ఉండటంతో తనయుడు చరణ్ సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ చెప్పక తప్పలేదని అంటున్నారు. ఇక ఈ మూవీని చరణ్ కు ‘ధృవ’ తో కమర్షియల్ సక్సెస్ అందించిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడిగా చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: